హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంతకల్ డివిజన్లలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో మంగళవారం పలు మార్గాల్లో నడవాల్సిన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సోమవారం రద్దు చేసింది. విజయవాడ డివిజన్లోని నెల్లూరు – పడుగుపాడు, గుంతకల్లు డివిజన్లోని రాజంపేట – నందులూరు మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో రేపు నడవాల్సిన చెన్నై సెంట్రల్ – సీఎస్టీ ముంబయి (22160) రైలును రద్దు చేసింది.
అలాగే చెన్నై ముంబయి – చెన్నై సెంట్రల్ (22159), ఎల్టీటీ ముంబయి – చెన్నై సెంట్రల్ (12163), బిలాస్పూర్ – తిరునల్వేలి (22619), ఈ నెల 24న నడువాల్సిన గోరఖ్పూర్ – సికింద్రాబాద్ (12589)ను రద్దు చేసింది. అలాగే కేవాడియా – చెన్నై సెంట్రల్, 25న నడవాల్సిన పాట్నా – బన్సవాడి (22353), దిబ్రూగఢ్ – కన్యాకుమారి (15906) ట్రైన్ను తిరువనంతపురం – కన్యాకుమారి మధ్య పాక్షికంగా రద్దు చేసింది. నిన్న రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించింది.