న్యూఢిల్లీ: కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత కంటే కొవిడ్ వల్లే గుండె పోటు వచ్చే ప్రమాదం 4-5 శాతం ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకడమే గుండె పోటుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. నాడీ వ్యవస్థ విఫలం కావడానికి కూడా కొవిడే కారణమని డబ్ల్యూహెచ్వో, ఇతర నిపుణులు పదేపదే చెప్పారు.
‘కరోనా వైరస్తో చిన్న ప్రమాదం ఉన్నది. టీకా వల్ల కలిగిన రోగ నిరోధక శక్తిని అధిగమించేలా అది పరివర్తన చెందవచ్చు. కాబట్టి నిరంతర పర్యవేక్షణ, జాగ్రత్తలు అవసరం’ అని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో కొవిడ్ ఒక ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా కొనసాగుతుందని గత నెల మొదట్లో డబ్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే పుట్టి ఉంటుందని తాము నమ్ముతున్నట్టు అమెరికా ఎఫ్బీఐ డెరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు. ఎఫ్బీఐ మొదటిసారి పబ్లిక్గా ఈ విషయాన్ని నిర్ధారించింది. అయితే అది ప్రయోగశాల నుంచి లీకైందన్న విషయానికి సాక్ష్యం లేదని చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు.