న్యూఢిల్లీ, జూలై 16: మరికొద్ది రోజుల్లో చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నట్టు కేంద్రప్రభుత్వం తెలిపింది. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకొవ్-డీ’ టీకా ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని, 12-18 ఏండ్ల వయసున్న పిల్లలపై ఈ ప్రయోగాలు జరిగాయని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. త్వరలోనే ఈ టీకాకు రెగ్యులేటరీ అనుమతులు మంజూరు చేస్తామని తెలిపింది. 12-17 ఏండ్ల వయసున్న పిల్లలకు వెంటనే టీకాను అందుబాటులోకి తీసుకురావాలని టియా గుప్తా అనే మైనర్ పిటిషన్ వేశారు. దీనిపై కేంద్రం పై విధంగా స్పందించింది.