చెన్నై: త్వరలో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ అఖిల భారత సమాఖ్య)ను ప్రారంభించి, జాతీయ స్థాయిలో ఫెడలరిజం, సామాజిక న్యాయ సూత్రాల సాధనకు కృషి చేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ బుధవారం ప్రకటించారు. ఈ సమాఖ్యలో అన్ని రాష్ర్టాలకు చెందిన అణగారిన వర్గాల నేతల ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సామాజిక న్యాయం అనే అంశంపై ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయంపై నిజంగా శ్రద్ధ ఉండేవారు ఈ సమాఖ్యలో భాగమవుతారని స్టాలిన్ పేర్కొన్నారు.