Sonia-Rahul Gandhi Flight Emergency Landing | కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని మధ్యప్రదేశ్ భోపాల్లోని రాజాభోజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
సోనియాగాంధీ, రాహుల్ ఇద్దరు బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల కూటమి సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లైట్లో బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని భోపాల్ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. అక్కడి నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నట్లు సమాచారం.