న్యూఢిల్లీ, ఆగస్టు 13: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మరోసారి కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసొలేషన్లో ఉన్నారు. ఇటీవలే ఆమె కూతురు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి శనివారం పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్గా వచ్చింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ ఉన్నారు’ అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ శనివారం ట్విట్టర్లో తెలిపారు. ఈ ఏడాది జూన్లో కూడా సోనియాగాంధీకి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. సర్ గంగారామ్ హాస్పిటల్లో జూన్ 12న చేరిన ఆమె జూన్ 20న డిశ్చార్జి అయ్యారు.