న్యూఢిల్లీ: వీలైనంత త్వరగా జనాభా లెక్కలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ(Sonia Gandhi) డిమాండ్ చేశారు. ఇవాళ రాజ్యసభలో ఆమె మాట్లాడారు. ఆహార భద్రత చట్టం కింద సుమారు 14 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందలేకపోతున్నట్లు ఆమె చెప్పారు. జీరో అవర్లో ఆమె మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం నేషనల్ ఫుడ్ సెక్యూర్టీ యాక్ట్ లబ్ధిదారుల్ని గుర్తిస్తున్నారని, తాజా జనాభా లెక్కల ప్రకారం అది జరగడం లేదన్నారు. ఎన్ఎఫ్ఎస్ఏ పథకాన్ని 2013లో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ స్కీమ్ వల్ల కోట్ల సంఖ్యలో జనం ఆకలి చావుల నుంచి తప్పించుకున్నట్లు ఆమె తెలిపారు. కోవిడ్19 సంక్షోభ సమయంలోనూ ఆమె స్కీమ్ బాగా పనిచేసిందన్నారు. టీపీడీఎస్ విధానం ద్వారా గ్రామాల్లో 75 శాతం, పట్టణాల్లో 50 శాతం మందికి సబ్సిడి ఆహారధాన్యాలు అందించినట్లు చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ సంఖ్య సుమారు 81.35 కోట్లు ఉంటందని ఆమె చెప్పారు.
#WATCH | Speaking in Rajya Sabha, Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says “The National Food Security Act (NFSA), introduced by the UPA government in September 2013, was a landmark initiative aimed at ensuring food and nutritional security for the country’s 140… pic.twitter.com/uYHmPE8Qhu
— ANI (@ANI) February 10, 2025