న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆప్ నేత హర్భజన్ సింగ్, బీజేపీ ఎంపీ హేమ మాలిని పార్లమెంట్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, శశి థరూర్, జైరాం రమేష్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌధరి, కే సురేష్ ఓటు వేశారు.
ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, విపక్షాల అభ్యర్థిగా మార్గరేట్ అల్వాలు పోటీపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనున్నది. 780 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీంట్లో 543 మంది లోక్సభ, 245 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
అయితే 36 మంది తృణమూల్ ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉండనున్నారు. రాజ్యసభలో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో 744 మంది ఎంపీలు ఓటు వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన ఉద్దవ్ పార్టీలు మార్గరేట్ అల్వాకు మద్దతు ప్రకటించాయి.