న్యూఢిల్లీ/పనాజీ, జూలై 23: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా రెస్టారెంట్ నడుపుతున్నారని, దానికి సంబంధించిన బార్ లైసెన్స్ నకిలీదని కాంగ్రెస్ ఆరోపించింది.
స్మృతి ఇరానీ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని, ఆమెను వెంటనే కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2021 మే నెలలో మరణించిన వ్యక్తి పేరుమీద 2022 జూన్లో లైసెన్స్ పొందారని, ఇది అక్రమం కాకపోతే ఇంకేమిటని ప్రశ్నించింది. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్గాంధీపై నిరంతరంగా పోరాడుతున్నందుకే తన కుమార్తెను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. తాము తప్పుచేసినట్టు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు.