న్యూఢిల్లీ : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ ఉత్తర గోవాలోని అస్సగావ్లో నడుపుతున్నారని, హైక్లాస్ రెస్టారెంట్లో బార్ లైసెన్స్ చనిపోయిన వ్యక్తి పేరుమీద రిన్యూవల్ చేయించుకున్నారనే వార్తలు దుమారం రేపాయి. ఈ వార్తలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తన కుమార్తె విద్యార్థిని అనీ, ఆమె గోవాలో ఏ బార్ను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు.
తాను న్యాయస్థానం, ప్రజాకోర్టులో సమాధానాలు కోరుతానన్నారు. సోనియా, రాహుల్ గాంధీ రూ.5వేలకోట్ల దోపిడీపై తన తల్లి విలేకరుల సమావేశం పెట్టడమే తన కూతురు తప్పని.. 2014, 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై తన తల్లి పోటీ చేయడమే ఆమె తప్పని స్మృతి ఇరానీ ఆరోపించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమ బార్ను నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. వెంటనే ప్రధాని మోదీ స్పందించి స్మృతి ఇరానీని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ శనివారం డిమాండ్ చేసింది.