న్యూఢిల్లీ : ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు స్మార్ట్ వాచీలు, స్మార్ట్ గ్లాసులు వంటివి వినియోగించవద్దని లోక్సభ సచివాలయం సూచించింది. వీటి కారణంగా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది.
ఇదేవిధంగా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ధర్నాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం, ఆయుధాలు ప్రదర్శించడం, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేయకూడదని కోరింది. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై, ఆగస్టు 13 వరకూ కొనసాగనున్నాయి.