న్యూఢిల్లీ, డిసెంబర్ 3: రెండేండ్లపాటు కొవిడ్ మహమ్మారి పిల్లల చదువులను దెబ్బతీయడంతోపాటు స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మార్చింది. ఆన్లైన్ క్లాసుల కారణంగా తల్లిదండ్రులు పిల్లలకు అనివార్యంగా స్మార్ట్ఫోన్లు చేతికివ్వాల్సి వచ్చింది. కొవిడ్ మనల్ని వీడినా స్మార్ట్పోన్ల వాడకం అలవాటు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని లోకల్ సర్కిల్స్ తాజా సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా 287 జిల్లాల నుంచి 65 వేల మంది పౌరుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. 9-13 ఏండ్ల వయసు పిల్లలు 3 గంటలకుపైగా స్మార్ట్ఫోన్లోనే కండ్లు పెడుతున్నారట. 13-17 ఏండ్ల వయసు పిల్లలు స్మార్ట్ఫోన్లకు బానిసలైనట్టు 44 శాతం మంది అభిప్రాయపడ్డారు. మూడు గంటలకుపైగా సోషల్మీడియా, వీడియోలు, ఇంటర్నెట్ గేమ్స్ల్లో పిల్లలు తలమునకలవుతున్నట్టు 62 శాతం మంది తెలిపారు. అనేక సోషల్మీడియా వేదికలు (ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్) మొదలైనవి 13 ఏండ్ల పైబడినవారు ఖాతాలు సృష్టించుకోవడానికి అనుమతులివ్వగా.. పదేండ్లలోపు పిల్లలు కూడా తప్పుడు వయసుతో ఖాతాలు తెరుస్తున్నారు. వీటిపై ఆయా సంస్థలు నివారణ చర్యలు చేపట్టలేదు. దీంతో ఫోన్కు బానిసై మానసిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వయో పరిమితిని 15 ఏండ్లకు పెంచాలని 68 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.
దేశంలో 287 జిల్లాల నుంచి 65 వేల మంది పౌరుల నుంచి సర్వే కోసం అభిప్రాయాలు సేకరించారు. 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది మహిళలు సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. 51 శాతం మంది మెట్రో, టైర్ 1 జిల్లాల నుంచి ఉన్నారు. 37 శాతం శాతం మంది టైర్ 2 జిల్లాల నుంచి, 12 శాతం మంది టైర్ 3, 4 జిల్లాల నుంచి ఉన్నారు.
ఇవ్వాల్సిన వయసు కంటే ముందే గాడ్జెట్స్ ఇచ్చాం. 28%
ఒత్తిడి దూరం కావడానికి 13%
స్కూల్ కార్యక్రమాలు ఆన్లైన్ కావడం వల్ల 26%
తల్లిదండ్రులు ఎక్కువగా గాడ్జెట్స్ వాడటం వల్ల 31%
చెప్పలేం 2%