ఎన్నికల ప్రచారంలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరసన సెగ తగిలింది. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గోండా జిల్లాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈయన ప్రసంగిస్తున్న సమయంలో యువకులు ఒక్కసారిగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆర్మీలో ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేయడ ప్రారంభించారు. ‘ఆర్మీలోని ఖాళీలను భర్తీ చేయండి… మా డిమాండ్ను నెరవేర్చండి’ అంటూ యువకులు నినాదాలు చేశారు. అలాగే ఆర్మీలో ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారంటూ రాజ్నాథ్ను సూటిగా ప్రశ్నించారు.
అయితే.. ఈ నినాదాలు రాజ్నాథ్కు అర్థం కాలేదు.. పక్కనున్న నేతలను అడగ్గా…. ఆర్మీలోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అని చెప్పారు. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ స్పందించారు.. ‘ఆందోళన చెందకండి.. భర్తీ చేస్తాం.. భర్తీ చేస్తాం. మీ ఆందోళనను అర్థం చేసుకున్నా. కరోనా కారణంగా కాస్త ఆలస్యమైంది’ అంటూ రాజ్నాథ్ సమాధానమిచ్చారు. దీంతో యువకులు శాంతించారు.