న్యూఢిల్లీ, మే 21: వాతావరణ మార్పులతో భూతాపం పెరగడం, సముద్ర మట్టాలు పెరగడం వంటి సమస్యలు వస్తాయని ఇప్పటివరకు మనకు తెలిసిందే. అయితే వాతావరణ మార్పుల కారణంగా నిద్ర లేమి సమస్య కూడా ఎదురవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. పలువురు ధరించిన స్లీప్ ట్రాకర్ల ద్వారా సేకరించిన డాటాను డెన్మార్క్లోని కోపెన్హాగెన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు విశ్లేషించారు. ఉష్ణోగ్రతలు పెరుగడంతో 2099 నాటికి ఏటా ప్రతి వ్యక్తి 50 నుంచి 58 గంటల నిద్రను కోల్పోతారని చెబుతున్నారు. అంటే ప్రతి రాత్రి దాదాపు 10 నిమిషాల నిద్ర కోల్పోతారన్న మాట. తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ప్రజల నిద్రపై ఉష్ణోగ్రతల పెరుగుదల కాస్త ఎక్కువ ఉంటుందని పేర్కొంటున్నారు. భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మెక్సికో పాటు 68 దేశాలకు చెందిన 48 వేల మంది నిద్రకు సంబంధించిన డాటాను 2015 నుంచి 2017 వరకు కోపెన్హాగెన్ వర్సిటీకి చెందిన పరిశోధకుడు కెల్టన్ మైనర్ విశ్లేషించారు.