సూరత్: గుజరాత్లోని సూరత్లో ఘోర ప్రమాదం జరిగింది. సూతర్లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో (chemical factory) విషవాయువు లీకైంది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని సూరత్ సివిల్ దవాఖానకు తరలించారు.
సచిన్ జీఐడీసీ ప్రాంతంలో పలు రసాయన ఫ్యాక్టరీలు ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున ఓ కంపెనీలో గ్యాస్ లీకయిందని అధికారులు తెలిపారు. దీంతో ఆరుగురు కార్మికులు మరణించారని, మరో 20 మంది సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని దవాఖాన ఇన్చార్జి సూరింటెండెంట్ డాక్టర్ ఓంకార్ చౌదరి తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.