ఘాజియాబాద్ (యూపీ): స్కూల్ బస్సు, కారు ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు. ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఎస్యూవీ కారులో మీరట్ నుంచి గురుగ్రామ్కు బయలుదేరారు. అయితే రాంగ్ రూట్లో వస్తున్న స్కూలు బస్సు బలం గా ఢీకొట్టడంతో కారు లో ఉన్న ఆరుగురు మరణించారు.గాయాలైన ఇద్దరిని దవాఖానకు తరలించారు.