లక్నో : కన్వర్ యాత్రలో విషాదం నెలకొంది. కన్వరియాలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో ఆరుగురు యాత్రికులకు గాయాలయ్యాయి. యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. గొల గోరఖ్నాధ్ శివాలయంలో పవిత్ర జలాల్లో స్నానం చేసిన అనంతరం 50 మంది కన్వరియాల బృందం షహజన్పూర్ జిల్లాకు తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
అతివేగంతోనే వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందగానే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలపడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.