రిజిస్ట్రేషన్కు ప్రత్యేక పోర్టల్.. వాహన తుక్కు విధానంపై మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: జాతీయ వాహన తుక్కు విధానంలో భాగంగా ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్లు(ఏటీఎస్), వాహన తుక్కు కేంద్రాల(ఎస్వీఆర్ఎఫ్) ఏర్పాటుపై కేంద్రం మార్గదర్శకాలను జారీచేసింది. ‘వ్యక్తులు, స్పెషల్ పర్పస్ వాహనాలు, కంపెనీలు, సంస్థలు, రాష్ట్రప్రభుత్వాలు తమ పేరు మీద ఏటీఎస్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు’ అని తెలిపింది. అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి సింగిల్ విండో విధానం ఉంటుందని వెల్లడించింది. దీనికోసం ప్రత్యేక పోర్టల్ను రూపొందిస్తామని పేర్కొన్నది. కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకొన్న 60 రోజుల్లో అనుమతులు లభిస్తాయని తెలిపింది. ‘ట్రాన్స్పోర్టు కమిషనర్ ర్యాంకుకు తక్కువ కాని వ్యక్తి ఈ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ అధికారిగా ఉంటారు’ అని వెల్లడించింది. మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం జాతీయ వాహన తుక్కు విధానాన్ని ప్రకటించింది. కాలం చెల్లిన వాహనాలను తుక్కు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే కొత్త వాహనాల కొనుగోలులో రాయితీ లభిస్తుందని పేర్కొన్నది.