సింగపూర్: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను అనుమతిస్తున్నట్లు సింగపూర్ శనివారం ప్రకటించింది. భారత్తోపాటు దక్షిణాసియాలోని ఆరు దేశాల పౌరులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఆ జాబితాలో బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్ ఉన్నాయి.
14 రోజుల ప్రయాణ హిస్టరీ ఉన్న ప్రయాణికులను అనుమతిస్తున్నట్లు సింగపూర్ తెలిపింది. అయితే, వారు పది రోజులు హోం క్వారంటైన్ కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై మాత్రం కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించింది.