Singapore | సింగపూర్లోని భారతీయ సంతతికి చెందిన 64 సంవత్సరాల వ్యక్తికి జైలుశిక్ష పడింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండువారాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, సదరు వ్యక్తి కరోనా నిబంధనలు పాటించకుండా.. సహోద్యోగులను ఇబ్బందులకు గురి చేసినట్లుగా ఆరోపణలున్నాయి. వివరాల్లోకి వెళితే.. తమిళ్ సెల్వం అనే వ్యక్తి సింగపూర్లోని ఓ కంపెనీలో క్లీనర్గా పని చేస్తున్నాడు. అతనికి అక్టోబర్ 18, 2021న ఆరోగ్యం బాగలేకపోవడంతో కొవిడ్ టెస్టులు నిర్వహించారు. పరీక్షలు కొవిడ్ పాజిటివ్గా తేలింది. అయితే, అతను ఇంటికి వెళ్లకుండా సమాచారాన్ని తెలిపేందుకు లాజిస్టిక్ కార్యాలయానికి చేరుకోగా.. తమిళ సెల్వంను వెళ్లిపోవాలని సూచించారు.
అయితే, కరోనా సోకినా దగ్గుతూ అక్కడే తిరిగాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో సహోద్యోగులు ఇబ్బందికి గురయ్యారు. ఇందులో ఓ తోటి ఉద్యోగి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అతడిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అయితే, ఘటన తర్వాత ఎవరికీ కరోనా సోకలేదు కానీ.. తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వ్యవహారంపై తోటి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కరోనాను తమిళసెల్వం సీరియస్గా తీసుకోలేదని భవించిన కోర్టు.. ఈ మేరకు దోషిగా నిర్ధారిస్తూ రెండు వారాల జైలుశిక్ష విధించింది. అయితే, సింగపూర్లో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు కనీసం ఆరు నెలల జైలు శిక్షతో పాటు 10వేల సింగపూర్ డాలర్లు జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయి.