ర్యాష్ డ్రైవింగ్ కేసులో కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ సిద్దూ పాటియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. శిక్ష ప్రారంభమైన రోజు నుంచి ఆయన జైలు తిండి తినడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదట. జైలు అధికారులు ఇచ్చే దాల్ రోటీని తిరస్కరిస్తున్నారట. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.
దీంతో జైలు అధికారులు సిద్దూ ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించారు. వైద్యులు తగిన మోతాదు ఉండే డైట్ను సూచించారు. ప్రత్యేకంగా ఓ డైట్ ఛార్ట్నే రూపొందించి, జైలు అధికారులకు ఇచ్చారు. బాదం పప్పు, బాదాంలతో పాటు బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని వైద్యులు జైలు అధికారులకు సూచించారు.
రోజ్మేరీ టీ, ఓ గ్లాస్ జ్యూస్, లేదంటే పుచ్చకాయ, కీవో ఫ్రూట్, స్ట్రాబెర్రీ, బీట్రూట్, దోసకాయలు, ఆహారం తీసుకునే సమయంలో నెయ్యి, జామ పండ్లు, ఆమ్లా (ఉసిరి), ఇవ్వాలని సూచించారు. ఇందులో ఉన్న జ్యూస్లు లభ్యం కాని పక్షంలో మొలకెత్తిన విత్తనాలు అందివ్వాలని వైద్యులు సూచించారు. ఇక.. ఆహారంగా చపాతీలు, కీరా దోసలు, ఓ కూర, కూరగాయల సూప్ ఇవ్వాలని వైద్యులు సూచించారు.