అమృత్సర్ : పంజాబ్లో నాయకత్వ మార్పు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ను తప్పించాలని నవజ్యోత్ సింగ్ సిద్ధూ వర్గం మరోసారి డిమాండ్ చేస్తోంది. పార్టీ శ్రేణుల్లో కెప్టెన్ సింగ్ పట్ల అసంతృప్తి పెల్లుబుకుతోందని కాంగ్రెస్ హైకమాండ్కు వివరించాలని నలుగురు క్యాబినెట్ మంత్రులు సహా 34 మంది పంజాబ్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
సిద్ధూకు సన్నిహితులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్రిప్త్ బాజ్వా, సుఖ్జిందర్ సింగ్ రంధ్వా, సర్కారియా, చరణ్జిత్ చన్ని, పర్గత్ సింగ్ తదితురులు ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలిసి కెప్టెన్ సింగ్ను సీఎం పదవి నుంచి తప్పించాలని కోరేందుకు సన్నద్ధమయ్యారు. సీఎం మార్పు వ్యవహారం పార్టీ కేంద్ర నాయకత్వ విచక్షణాధికారమే అయినా అతడి పట్ల తాము విశ్వాసం కోల్పోయామని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ మంత్రి చరణ్జిత్ సింగ్ పేర్కొన్నారు.
అమరీందర్ సింగ్ స్ధానంలో మరో సీఎంను ప్రతిపాదించాలని మంత్రి బాజ్వా కోరారు. సీఎంను మార్చకపోతే పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోతుందని, ఈ వ్యవహారంపై సోనియా గాంధీతో చర్చించేందుకు తాము ఢిల్లీ వెళుతున్నామని బాజ్వా వెల్లడించారు.