అదో ఎన్నికలకు సంబంధించిన సమావేశం. అందరూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ అమాంతం ధ్యాన ముద్రలోకి వెళ్లిపోయారు. కళ్లు మూసుకున్నారు. ఏదో మంత్రాన్ని జపిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. పంజాబ్లోని దశమేశ్ నగర్ అనే ప్రాంతంలో మంగళవారం సిద్దూ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అయితే ఆ సమావేశంలో పాల్గొన్న వారెవరో ఈ సన్నివేశాన్ని రికార్డు చేశారు. అయితే దీనిపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందించారు. సిద్దూ ప్రతి రోజూ రెండు సార్లు దేవుడితో మాట్లాడుతుంటాడంటూ జోక్ వేశారు.
Sidhu Ji after @RahulGandhi ‘s speech yesterday
— YM106Rd (@Ym106R) February 9, 2022