బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని హనుమాన్గర్హి ఆలయ పూజారి మహంత్ రాజు దాస్ మండిపడ్డారు. రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం ఆహ్వానాన్ని (Ayodhya invitation row) సిద్దరామయ్య తిరస్కరించడాన్ని ఆదివారం విమర్శించారు. ‘సిద్దరామయ్య అంటే రాముడితో కూడిన చాలా మంచి పేరు. కానీ ఆయన చర్యలు కాలనేమి (అసురుడు) లాగా ఉన్నాయి. వారు (కాంగ్రెస్) బాబర్ గురించి, దాడి చేసేవారి గురించి ఆందోళన చెందుతున్నారు. మెజారిటీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. సీటీ రవి (బీజేపీ నేత) చెప్పింది తప్పు కాదు’ అని వ్యాఖ్యానించారు.
కాగా, కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై బీజేపీ నేత సీటీ రవి శనివారం మాటల దాడికి దిగారు. రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనబోమన్న కాంగ్రెస్ నేతలపై ఆయనపై మండిపడ్డారు. ‘ప్రాణ ప్రతిష్టకు వెళ్లబోమని ఆ పార్టీ వారు ( కాంగ్రెస్ నేతలు) చెప్పారు. ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారు. వారు బాబర్ని వదిలి రాముడిని పట్టుకోలేరు. బాబర్ని వదిలిపెడితే రాముడిని పట్టుకోవడం సులభం. బాబర్ని విడిచిపెడితే పెద్ద మొత్తంలో ఓట్లు వారు పొందలేరు. రాముడు అందరివాడు. విగ్రహ ప్రాణప్రతిష్టను పండుగలా జరుపుకోవాలి’ అని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Ayodhya, Uttar Pradesh | Hanumangarhi temple priest Mahant Raju Das says, says, "…Siddaramaiah is such a good name, associated to Lord Ram, but his actions are like that of Kalanemi (an asura)…Their worry about Babar, about attackers and the way they are toying with… https://t.co/ap4Qg2WtIn pic.twitter.com/yA6FnNlguh
— ANI (@ANI) January 14, 2024