బెంగుళూరు: కర్నాటక మాజీ సీఎం, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఎడ్ల బండిపై అసెంబ్లీకి వచ్చారు. ఇవాళ కర్నాటక వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు ఎడ్ల బండ్లపై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి వెళ్లారు. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపించారు. పెట్రోల్ ధరలను నియంత్రించడంలేదని, ఎల్పీజీ సిలిండర్ ధరలు కూడా దారుణంగా పెరిగినట్లు మాజీ సీఎం సిద్ధిరామయ్య ఆరోపించారు. కర్నాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఎడ్ల బండ్లపైనే అసెంబ్లీకి వచ్చారు. ఇంధన ధరల పెరుగుదలకు మమ్ముల్ని నిందించడం అవివేకమని కాంగ్రెస్ నేత సిద్దిరామయ్య ఆరోపించారు. ఎక్సైజ్ సుంకం రూపంలో రాష్ట్రం సుమారు 24 లక్షల కోట్లు వసూల్ చేసిందని, ఆ సొమ్మంతా ఎక్కడికి వెళ్లినట్లు మాజీ సీఎం సిద్ధిరామయ్య ప్రశ్నించారు.