Shraddha Walkar | దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో ఘటన వెలుగు చూస్తుంది. శ్రద్ధానే తాను హత్య చేశానని కోర్టులో ఆఫ్తాబ్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఇక ఆఫ్తాబ్కు నార్కో టెస్టు నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే శ్రద్ధా వాకర్ హత్యకు గురైన రోజే.. ఆమె తన ఫ్రెండ్కు ఇన్స్టాగ్రామ్లో ఒక మేసేజ్ను పంపింది. అదేంటంటే.. డ్యూడ్ ఐ హ్యావ్ గాట్ న్యూస్ అని రాసి పంపించింది శ్రద్ధా. ఈ మేసేజ్ మే 18వ తేదీన సాయంత్రం 4:34 గంటల సమయంలో వచ్చింది. అదే మేసేజ్లో ఐ గాట్ సూపర్ బిజీ విత్ సమ్థింగ్ అని రాసి పంపింది.
అదే రోజు సాయంత్రం 6:29 గంటల సమయంలో శ్రద్ధాకు ఆమె ఫ్రెండ్ వాట్స్ ది న్యూస్? అని రిప్లైలో అడిగాడు. ఆ మేసేజ్కు శ్రద్ధా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో శ్రద్ధా ఫ్రెండ్.. ఆఫ్తాబ్కు అతని అధికారిక ఇన్స్టాగ్రామ్లో సెప్టెంబర్ 15న శ్రద్ధా గురించి అడిగాడు. బ్రో వాట్స్ అప్? వేర్ హ్యావ్ యూ బీన్? నీడ్ టాక్ టు యూ. టెల్ శ్రద్ధా టు కాల్ మీ అని రాసి పంపాడు. ఈ మేసేజ్కు కూడా ఆఫ్తాబ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఫోన్ కాల్ చేసినప్పటికీ కూడా అతని నుంచి స్పందన లేదు.
శ్రద్ధా నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఫ్రెండ్ మళ్లీ సెప్టెంబర్ 24న సాయంత్రం 4:15 గంటలకు ఇన్స్టాలో మేసేజ్ పంపాడు. వేర్ ది హెల్ ఆర్ యూ? ఆర్ యూ ఓకే? అని రాసి పంపాడు. ఇలా అనేకసార్లు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, ఫ్రెండ్కు నిరాశే ఎదురైంది.
అయితే శ్రద్ధా వాకర్ను మే 18వ తేదీన ఆఫ్తాబ్ చంపేశాడు. నాటి నుంచి ఆమె ఇన్స్టాను కూడా ఆఫ్తాబ్ హ్యాండిల్ చేస్తున్నాడు. ఆమె సజీవంగా ఉందని ఫ్రెండ్స్కు తెలిపేందుకు జూన్ వరకు ఆమె ఇన్స్టా ఖాతాను ఆఫ్తాబ్ హ్యాండిల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.