Aftab Poonawala : శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను తరలిస్తున్న పోలీసు వాహనంపై కొందరు కత్తులతో దాడి చేశారు. ఢిల్లీ రోహిణి మార్గంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సోమవారం సాయంత్రం అఫ్తాబ్ను తీసుకెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్లో అతనికి పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు. ల్యాబొరేటరీ బయట వాహనంలో ఉన్న అఫ్తాబ్పై ఇద్దరు వ్యక్తులతో కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఒక వ్యక్తి వాహనంలోకి చొరబడేందుకు యత్నించాడు. అయితే.. ఆ సమయంలో అఫ్తాబ్కు రక్షణగా ఉన్న ఐదుగురు పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఈ సంఘటనలో హిందూ సేనకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలుగా కోసేందుకు అఫ్తాబ్ ఉపయోగించిన కత్తులను పోలీసులు సోమవారం రికవరీ చేశారు. అంతేకాదు శ్రద్ధాకు అఫ్తాబ్ ఇచ్చిన ఉంగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. శ్రద్ధా హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
#WATCH | Police van carrying #AaftabPoonawalla, accused of killing his live-in partner #ShraddhaWalkar , attacked by at least two men outside FSL office in Delhi’s Rohini. pic.twitter.com/9SzbTs5SVU
— TOI Delhi (@TOIDelhi) November 28, 2022