కోల్కతా: ఆవులతో వెళ్తున్న ఒక వాహనాన్ని అడ్డుకొని వాటి జనన ధ్రువీకరణ పత్రాలు చూపాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర చేసిన డిమాండ్పై విమర్శలు రేకెత్తాయి. వధ శాలకు అవులను తరలించాలంటే వాటి వయసు 14 ఏండ్లు దాటి ఉండాలని.. ఈ నేపథ్యంలో వాటి జనన ధ్రువీకరణ పత్రాలను చూపాలని శనివారం రేఖా పాత్ర వాహనదారుడిని కోరారు. హింగల్ గంజ్లో గోవుల రవాణా వాహనాన్ని ఆపి వాటిని కిందకు దించారు. కబేళాకు తరలించే పశువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించిందని చెప్పారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ స్పందిస్తూ.. గతంలో గోవులకు డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కార్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఈ తరహా సర్టిఫికెట్లు జారీ చేసి ఉంటే చూపాలని కోరారు.