Fire in Train | చెన్నై-ముంబై మధ్య నడిచే లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలు ఇంజిన్లో షార్ట్ షర్క్యూట్తో మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. లోకో మోటివ్ కో-పైలట్ అప్రమత్తమై రైలు ఇంజిన్ నిలిపివేశారు. పవర్ కార్, రైలు ఇంజిన్ మధ్య ఎలక్ట్రిక్ లింక్ తెగిపోవడంతో స్వల్పంగా మంటలు వచ్చాయి. దీంతో పొగలు చిమ్మడంతో చెన్నై నగర పరిధిలోని వ్యాసార్పాడీ స్టేషన్ వద్ద రైలు నిలిచిపోయింది.
సాయంత్రం 6.20 గంటలకు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి లోక మాన్య తిలక్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. అలా బయలుదేరిన కొద్ది సేపటికే మంటలు వచ్చాయి. దీంతో వ్యసార్పాడీ స్టేషన్ వద్ద రైలు అలా నిలిచిపోగానే ప్రయాణికులంతా భయాందోళనతో కిందకు దూకి దూరంగా పరుగులు తీశారు. దీనివల్ల దాదాపు అర్ధగంట సేపు రైలు ప్రయాణం ఆలస్యమైంది.
దీనిపై రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు. హెచ్ఓజీ కూపర్లో సమస్య వల్లే మంటలు వచ్చాయని తెలిపారు. ఇంజిన్, పవర్ కార్ మధ్య హెచ్ఓజీ కనెక్టర్ లో సమస్య వల్ల కేవలం పొగలు మాత్రమే వచ్చాయని, మంట వెలువడలేదని చెప్పారు. సమస్య పరిష్కరించిన తర్వాత రాత్రి 7.15 గంటలకు రైలు బయలుదేరి వెళ్లిందన్నారు.