న్యూఢిల్లీ : గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. కోటి 33 లక్షల 83 వేల 718 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభకు మంగళవారం వివరించారు. అదే సమయంలో కొత్తగా 4,177 మందికి భారత పౌరసత్వం ఇచ్చినట్లు చెప్పారు.