సామ్నా సంపాదకీయంలో శివసేన బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడింది. బీజేపీ నేతలు నాథురాం గాడ్సేను ఓ వైపు కీర్తిస్తూనే.. విదేశీ ప్రతినిధులను మాత్రం సబర్మతీ సందర్శన నిమిత్తం తీసుకెళ్తారని ఎద్దేవా చేసింది. ”మహాత్మా గాంధీ భారత్కు ఓ గుర్తింపు అంటూ అభివర్ణించింది. ఇదో పెద్ద ఆశ్చర్యం. నాథు రాం గాడ్సే సిద్ధాంతాన్ని బీజేపీ మోస్తుంది. కానీ.. ఎవరైనా విదేశీ ప్రతినిధులు వస్తే మాత్రం… వారిని సబర్మతీ ఆశ్రమానికి తీసుకెళ్తుంది” అంటూ సామ్నా సంపాదకీయంలో శివసేన దెప్పిపొడించింది. గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉన్నా… ఇప్పటికీ విదేశీయుల్ని సబర్మతీ ఆశ్రమానికే తీసుకెళ్తారని విమర్శించింది.
గుజరాత్ వేదికగా సర్దార్ పటేల్ భారీ విగ్రహమే పెట్టారు. అయినా బోరిస్ జాన్సన్తో సహా ఇతర విదేశీ ప్రతినిధులను అక్కడికి తీసుకెళ్లారు. ఎందుకంటే.. భారత్కు ఓ గుర్తింపులా గాంధీ నిలబడ్డారు అంటూ శివసేన పేర్కొంది.
ఇక దేశ వ్యాప్తంగా జరుగుతున్న సంప్రదాయిక హింసపై కూడా స్పందించింది. దేశ వ్యాప్తంగా మత హింస జరుగుతున్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటనకు వచ్చారని, భారత్లో పర్యటించారని పేర్కొంది. స్వాతంత్ర పోరాట సమయంలో దేశంలో మతపరమైన గొడవలు జరిగాయని, మళ్లీ ఇప్పుడు అలాంటి వాతావరణాన్నే బోరిస్ జాన్సన్ చూస్తున్నారని శివసేన చెప్పుకొచ్చింది.