ముంబై: శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక హెచ్చరిక చేశారు. 2002 ఫిబ్రవరి 27న అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు ప్రయాణించిన సబర్మతి ఎక్స్ప్రెస్ రైలును తగులబెట్టారని, త్వరలో రామాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనే భక్తులు తిరిగి వచ్చేటపుడు కూడా అటువంటి దారుణం జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే సోమవారం జలగావ్లో మాట్లాడుతూ, అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి అనేక మందిని ఆహ్వానించే అవకాశం ఉందని, వారంతా బస్సులు, ట్రక్కుల్లో వచ్చి, తిరిగి వెళ్లేటపుడు గోద్రా వంటి సంఘటన జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.