ముంబై: దుబాయ్ టూర్కు వెళ్లిన శివసేన పార్టీ ఎమ్మెల్యే రమేశ్ లక్టే అక్కడ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 52 ఏళ్లు. కుటుంబంతో కలిసి దుబాయ్ టూర్కు ఎమ్మెల్యే రమేశ్ వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముంబైలోని అంధేరి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే కావడానికి ముందు ఆయన బీఎంసీ కార్పొరేటర్గా కూడా చేశారు. ఎమ్మెల్యే రమేశ్ భౌతికదేహాన్ని ఇవాళ ముంబై తీసుకురానున్నారు. ఎమ్మెల్యే రమేశ్ మృతి పట్ల ఎంపీ ప్రియాంకా చతుర్వేది నివాళి అర్పించారు. కరోనా మహమ్మారి సమయంలో ఆయన చేసిన సేవల్ని ఎంపీ గుర్తు చేసుకున్నారు.