సబ్ కా సాథ్… సబ్ కా వికాస్ అన్న నినాదం ఒక్క అటల్ బిహారీ వాజ్పాయ్కి మాత్రమే సరిపోతుందని, ఇతరులకు సరితూగదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పరోక్షంగా మోదీని దెప్పి పొడిచారు. నెహ్రూ తర్వాత దేశం మొత్తం ఆమోదయోగ్యం ఉన్న నేత వాజ్పాయ్ అని రౌత్ కొనియాడారు. ”శివసేన- బీజేపీ మధ్య బంధాన్ని బలపరిచే విషయంలో వాజ్పాయ్ ఎంతో శ్రమించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న నినాదం ఆయనొక్కరికే సరిపోతుంది. నెహ్రూ తర్వాత దేశం మొత్తం కొనియాడే ఒకే ఒక్క నేత వాజ్పాయ్. నాగాలాండ్లో అయినా, పాండిచ్చేరిలో అయినా వాజ్పాయ్ని అందరూ కొనియాడుతారు” అంటూ రౌత్ వ్యాఖ్యానించారు. బీజేపీ విస్తరణలో వాజ్పాయ్, అద్వాణీ పాత్ర అమోఘమని రౌత్ కొనియాడారు.