ముంబై: బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాపై ఇవాళ అలనాటి అందాల తార శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రా రూ.50 కోట్లకు పరువు నష్టం దావా ( Defamation case ) వేశారు. రాజ్కుంద్రా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మోసం చేశాడని, మానిసికంగానూ వేదించడానికి పేర్కొంటూ షెర్లిన్ చోప్రా ఐదు రోజుల క్రితం ముంబైలోని జుహూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్కుంద్రా ఆయన శిల్పాశెట్టి కలిసి షెర్లిన్ చొప్రాపై పరువునష్టం దావా వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, పోర్నోగ్రఫీ ఆరోపణలపై రాజ్కుంద్రాతోపాటు మరో 11 మందిని గత జూలై 19న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, సెప్టెంబర్ 20న ఈ కేసులో రూ.50 వేల పూచీకత్తుపై రాజ్కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయన బెయిల్పై విడుదలయ్యాడు.