న్యూఢిల్లీ, మే 21: రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులంతా తమ స్వస్థలాలకు వచ్చేశారు. అయితే తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న చిరుత పులి, బ్లాక్ పాంథర్ను వదిలి రాలేక ఏపీకి చెందిన డాక్టర్ గిరికుమార్ పాటిల్ అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు వాటిని రక్షించేందుకు ఏకంగా రూ.80 లక్షలతో షెల్టర్ను నిర్మిస్తున్నాడు. బాంబు దాడుల నుంచి కూడా తట్టుకోగలిగేలా ఈ షెల్టర్కు రూపకల్పన చేశాడు. అందుకోసం అక్కడ ఉన్న తన ఆస్తులు, కారును కూడా అమ్మేశాడట.