న్యూఢిల్లీ : భారతీయులకు తామేం తినాలి, ఎవరిని ఆరాధించాలనే దానిపై పూర్తి స్వేచ్ఛ ఉండాలని వారి అభిరుచులను వారిని నిర్ణయించుకునేందుకు అనుమతించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor)అన్నారు. మనమేం తినాలి, ఎవరిని ప్రేమించాలి..ఏం మాట్లాడాలనే దానిపై ప్రభుత్వం మనకు చెప్పకూడదనేది తన ఉద్దేశమని స్పష్టం చేశారు. అలాంటి పరిస్ధితి ఉంటేనే భారత్ వెలుగొందుతుందని పేర్కొన్నారు. ఓ వార్తా చానల్ నిర్వహించిన కార్యక్రమంలో శశి థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఏకాభిప్రాయం కీలకమని అన్నారు. హిందుత్వగా చెబుతున్న దాని కంటే స్వామి వివేకానంద హిందుత్వ సిద్ధాంతం పూర్తిగా భిన్నమైనదని చెప్పారు. వివేకానంద చెప్పే హిందుత్వ సమ్మతిని బోధిస్తుందని అన్నారు. మీ వద్ద సత్యం ఉంటేమీ సత్యాన్ని నేను గౌరవిస్తా నన్ను మీరు గౌరవించాలని వివేకానంద సూక్తిని శశి థరూర్ ప్రస్తావించారు
. ఇక బ్రిటన్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలను శశి థరూర్ సమర్ధించారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనని మాటలను కూడా బీజేపీ ప్రచారం చేస్తూ క్షమాపణలు కోరుతోందని అన్నారు. రాజకీయాల్లో కాషాయ పార్టీ రాటుతేలిందని ఆయన చురకలు వేశారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
విదేశీ గడ్డపై రాజకీయాలు మాట్లాడిన విషయంలో క్షమాపణ చెప్పాల్సి వస్తే ప్రధాని మోదీనే ముందుగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఎలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నదని, ప్రజాస్వామ్యం పెనుముప్పును ఎదుర్కొటోందని రాహుల్ గాంధీ లండన్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేశంలో వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తున్నారని రాహుల్ ఇటీవల బ్రిటన్ వేదికగా వ్యాఖ్యానించారు.
Read More :