న్యూఢిల్లీ, ఆగస్టు 18: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్కు భారీ ఊరట లభించింది. భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆయనను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2014 జనవరిలో ఓ లగ్జరీ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దీంతో శశిథరూర్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దాదాపు ఏడేండ్లకుపైగా విచారణ సాగింది. బుధవారం కోర్టు ఆయనకు క్లీన్చిట్ ఇచ్చింది. తీర్పుపై శశిథరూర్ ఆనందం వ్యక్తం చేశారు. తాను ఏడేండ్లుగా పడుతున్న మానసిక ఆవేదనకు తీర్పుతో స్వాంతన చేకూరిందని తెలిపారు.