న్యూఢిల్లీ : షార్జా వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ( Air India Express flight) సాంకేతిక లోపం వాటిల్లిన కారణంగా త్రివేండ్రం ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
తిరుచిరాపల్లి నుంచి షార్జా బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 613 సోమవారం మధ్యాహ్నం 12.03 గంటల ప్రాంతంలో తిరువనంతపురం సమీపంలోని త్రివేండ్రం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో ఉన్న ప్రయాణీకులు అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పి ప్రయాణీకులంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సమయంలో విమానంలో 154 మంది ప్రయాణీకులు ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Read More :
AI | కృత్రిమ మేధతో పనిచేసే కండ్లద్దాలు.. వీటి సాయంతో అంధులు ఏ వస్తువునైనా చూడొచ్చు..!