మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కానున్నారు. ఈ సాయంత్రం 6ః30 నిమిషాలకు సీఎంతో పవార్ భేటీ కానున్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ జరగనుంది. ఈ సమావేశానికి హోంమంత్రి దిలీప్ వల్సే పాటిల్ కూడా హాజరవుతున్నారు. మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ కావడం మహా వికాస్ అగాఢీకి, ఎన్సీపీకి పెద్ద శరాఘాతమేనని ఇరు వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సీఎం ఉద్ధవ్, ఎన్సీపీ అధినేత పవార్ సమాలోచనలు జరుపుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరో వైపు మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపుతోంది. ఆయన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో కొందరు మంత్రులు భేటీ అయ్యారు. ఈ భేటీకి హోంమంత్రి దిలీప్ వల్సే పాటిల్, ఛగన్ భుజ్బల్, హసన్ ముష్రీఫ్ ఈ జాబితాలో వున్నారు.
మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్ట్ చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో నవాబ్ మాలిక్ను ఈడీ ఉదయం నుంచి ప్రశ్నిస్తోంది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ మరణ వాంగ్మూలాన్ని కూడా ఈడీ నమోదు చేసింది. విచారణ నిమిత్తమై ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం 7 గంటలకే నవాబ్ మాలిక్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఉదయం నుంచే మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.