పుణె: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నోరు జారారు. తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని, అజిత్ పవార్ తమ పార్టీ నేతే అంటూ పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది సేపటికే తాను అలాంటి ప్రకటన చేయలేదంటూ ప్రకటించారు.
శుక్రవారం బారామతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. కొంతమంది నేతలు రాజకీయంగా విభేదించి ఎన్సీపీని విడిచిపెట్టారని, దానిని పార్టీ చీలికగా అనరాదని పేర్కొన్నారు. ‘అజిత్ పవార్ మా పార్టీ నేత’ అంటూ ఆయన కుమార్తె సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలను మీడియా శరద్ పవార్ దృష్టికి తీసుకురాగా ఆయన ఈ విధంగా స్పందించారు.