లౌడ్ స్పీకర్ల అంశం మహారాష్ట్రను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో మహా వికాస్ అగాఢీ బుధవారం ఓ కీలక సమావేశం నిర్వహించింది. ఈ కీలక సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి బాలాసాహేబ్ థోరట్, జయంత్ పాటిల్, అజిత్ పవార్ హాజరయ్యారు.
ఓ వైపు లౌడ్ స్పీకర్ల విషయంలో రోజు రోజుకీ రాజ్ థాకరే తన వాయిస్ను పెంచుతున్న నేపథ్యంలో ఏం చేద్దాం అన్న దానిపై ఈ సమావేశం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి శరద్ పవార్ అధ్యక్షతన నడుస్తోంది. ఇప్పటికే ఓ రౌండ్ పవార్ సీఎం ఉద్ధవ్తో భేటీ అయ్యారు.
మహారాష్ట్రలోని శాంతిభద్రతలపై ఎన్సీపీ అధినేత పవార్ ఓ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలో పవార్ పలు సూచనలు చేశారు. అయితే అంతా పరిస్థితి అదుపులోనే ఉందని, భయపడాల్సిన పనే లేదని మహారాష్ట్ర హోంమంత్రి ఎన్సీపీ నేత పవార్కు హామీ ఇచ్చారు.