ముంబై: అనుకున్నట్లే జరిగింది. ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన ఆరు మంది ఎంపీలు ఇవాళ ఏకనాథ్ షిండే(Eknath Shinde) వర్గానికి చెందిన శివసేన పార్టీలో చేరారు. ముంబైలో జరిగిన ప్రెన్స్ కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉద్ధవ్ టీమ్లో మొత్తం 9 మంది ఎంపీలు ఉండగా, దాంట్లో ఇప్పుడు ఆరు మంది ఎంపీలు షిండే వర్గంలో చేరారు. దీంతో ఊహాగానాలకు బ్రేక్ పడింది. ఏక్నాథ్ వర్గంలో చేరిన ఎంపీల్లో ఓమ్రాజే నింబాల్కర్(ధారాశివ్), సంజయ్ దినా పాటిల్(ముంబై నార్త్ ఈస్ట్), సంజయ్ జాదవ్(పర్బని), సంజయ్ దేశ్ముక్(యవత్మాల్-వాసిమ్), నగేశ్ పాటిల్ అస్తికర్(హింగోలి), బౌసాహెబ్ వక్చౌరే(షిర్డి) ఉన్నారు.
రెబల్స్ ఎంపీలే షిండే వర్గంలో చేరడంలో సేన యూబీటీ సంఖ్య కేవలం మూడుకు పడిపోయింది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తప్పుకునేందుకు రెబల్స్కు మూడో వంతు మెజారిటీ కూడా ఉన్నది. ఆరు పులులు ఇక్కడే ఉన్నాయని, వాళ్లు ఇప్పుడు రియల్ శివసేన ఫ్యామిలీలో కలిశారని, రియల్ శివసేన ఫ్యామిలీకి వెల్కమ్ చెబుతున్నానని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే తెలిపారు. శివసేన పార్టీని కాపాడుకునేందుకు గతంలో తాము రెబల్స్గా మారామని, ఇప్పుడు రెండో దశ ప్రారంభమైందన్నారు.
Mumbai: Maharashtra Deputy CM and Shiv Sena chief Eknath Shinde says, “Today, 6 MPs have joined us. Sanjay Haribhau Jadhav, Bhausaheb Rajaram Wakchaure, Omprakash Bhupalsingh Nimbalkar, Sanjay Dina Patil, Sanjay Uttamrao Deshmukh and Nagesh Bapurao Patil Ashtikar. So we have 3… https://t.co/7glFSnOLXx pic.twitter.com/J99daG9PHN
— ANI (@ANI) June 22, 2026