South Delhi : ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షం, వేగంగా వీస్తున్న గాలుల కారణంగా మూడంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీ, సాకేట్ మెట్రో స్టేషన్ సమీపంలో, మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఐదు అంతస్థుల బిల్డింగ్ కూలిపోవడంతో స్తానికులు ఫైర్ డిపార్ట్మెంట్కు సాయంత్రం 7.44 గంటలకు సమాచారం అందించారు. ఆ వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు, ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
మూడు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. పోలీసులు, వైద్య బృందాలతోపాటు అంబులెన్స్ల్ని అధికారులు సిద్ధంగా ఉంచారు. ఈ బిల్డింగ్ కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. శిథిలాలు తొలగించి, అందులోని వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటివరకు పలువురిని సహాయక బృందాలు వెలికితీశాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో బాధితులకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడమే లక్ష్యంగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
#WATCH | Delhi: Rescue operation is underway after a five storey building collapsed in the Mehrauli police station area. pic.twitter.com/hzQl92FsSp
— ANI (@ANI) May 30, 2026
ఢిల్లీలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకాలం ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులకు ఇది కాస్త ఊరట కలిగించే అంశమే. అయితే, భారీ వర్షాలు, గాలులు ప్రమాదకరంగా మారాయి.