భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఖండ్వా జువైనల్ హోం నుంచి ఏడుగురు ఖైదీలు ఆదివారం తప్పించుకున్నారు. ఈ హోంలో మొత్తం 8 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలు ఉండగా, ఏడుగురు తప్పించుకున్నారని సిటీ సూపరింటెండెంట్ పోలీసు లలిత్ గాత్రే మీడియాకు తెలిపారు. ప్రస్తుతం హోంలో ఒక ఖైదీ మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. వీరంతా పలు నేరాల్లో నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. జువైనల్ హోంలోని టాయిలెట్ గోడను పగులగొట్టి.. బయటకు వచ్చారు. అనంతరం కంపౌండ్ వాల్ పక్కనున్న చెట్టు మీదకు వెళ్లి అవతలికి దూకి పారిపోయారు. పరారీ అయిన ఏడుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Madhya Pradesh | Seven inmates of a juvenile home in Khandwa escaped on Sunday by breaking the wall of a toilet and jumping over the compound wall: City Superintendent of Police (CSP) Lalit Gathre (20.02) pic.twitter.com/T3behntdO2
— ANI (@ANI) February 21, 2022