న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వంకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామినే కొనసాగించాలని కోర్టు గురువారం తీర్పు చెప్పింది. దీనిపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
తీర్పు వెలువడిన వెంటనే పళనిస్వామి వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. 2022 జూలై 11న జరిగిన పార్టీ సమావేశంలో పళనిస్వామి పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ, తమ ప్రత్యర్థి పన్నీరు సెల్వంను పార్టీ నుంబి బహిష్కరించారు. దీనిపై ఆయన కోర్టుకెక్కారు.