చెన్నై, ఏప్రిల్ 22: తమిళనాడులో విద్యుత్తు కోతలకు కేంద్రమే కారణమని డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. కేంద్రం నుంచి తగినంత బొగ్గు సరఫరా కావడం లేదని, సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్తు సరఫరా ఆకస్మికంగా నిలిచిపోవడమూ ఓ కారణమని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ పేర్కొన్నారు.
స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన 2021, మే తర్వాత ఒక్కసారి మాత్రమే విద్యుత్తు కోతలు జరిగాయని అన్నారు. ఒప్పందం ప్రకారం రోజుకు 72,000 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా అయ్యేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను ఆదేశించాలని సీఎం స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని లేఖలో కోరారు. తద్వారానే రాష్ట్రం విద్యుత్తు సంక్షోభం నుంచి బయపడగలుతుందని పేర్కొన్నారు.