న్యూఢిల్లీ, మే 15: అవినీతి ఆరోపణలపై ఐఏఎస్ అధికారి పద్మా జైస్వాల్కు కేంద్రం ఉద్వాసన పలికింది. 2007లో ఆరోపణలు రాగా రెండు దశాబ్దాల అనంతరం చర్యలు తీసుకోవడం గమనార్హం. ఆమె పలు రాష్ర్టాలలో విధులు నిర్వహించారు. అరుణాచల్ప్రదేశ్లోని పశ్చిమ కామెంగ్ జిల్లాకు డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన సమయంలోనే అవినీతి ఆరోపణలు వచ్చాయి.
దర్యా ప్తులో ఆమె సర్వీస్ రూల్స్ను ఉల్లంఘించారని వెల్లడైంది. ఆమెపై చర్య లు తీసుకోవడంలో సుదీర్ఘ జాప్యం పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోంశాఖ, డీవోపీటీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మధ్య సమన్వయంలోనే ఈ జాప్యం జరిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు. పద్మా జైస్వాల్పై విచారణ జరిగిన వెంటనే 2008 ఏప్రిల్లో సస్పెండ్ చేశారు.