న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలిగా సీమా ముస్తాఫా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె ‘ది సిటిజన్’ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ప్రధాన కార్యదర్శిగా ‘ది కారవాన్’ ఎడిటర్ అనంత్నాథ్, కోశాధికారిగా సకల్ మీడియా గ్రూప్ చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ పవార్ నియమితులయ్యారు. వీరి ఎన్నికను శనివారం ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిటీ ప్రకటించింది.