బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఏడాది తొలి రోజున విజయకేతనం ఎగురవేసింది. పీఎస్ఎల్వీ-సీ58 (PSLV-C58) రాకెట్ ద్వారా ఎక్సోపోశాట్ (XPoSat) శాటిలైట్ను విజయవంతంగా నింగిలోకి పంపింది. రాకెట్ నుంచి విడిపోయిన శాటిలైట్ను నిర్ణీత భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్ను ఇస్రో విడుదల చేసింది.
కాగా, అంతరిక్షంలోని రహస్యాలను అణ్వేషించే పోలారిమెట్రీ మిషన్ ద్వారా ఖగోళ పరిశోధనల పరంగా అమెరికా తర్వాత రెండవ దేశంగా భారత్ నిలిచింది. విశ్వంలోని బ్లాక్హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియైలు, పల్సర్ విండ్ నెబ్యులే వంటి ఖగోళ మూలాలకు సంబంధించిన వివరాలను అర్థం చేసుకోవడంలో పోలారిమెట్రీ మిషన్ సహకరిస్తుంది.
మరోవైపు ఇస్రో చీఫ్ సోమనాథ్ ఈ ప్రయోగం విజయంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కొత్త ఏడాదిలోని 12 నెలల్లో 12 ప్రయోగాలు చేపట్టడం తమ లక్ష్యమని తెలిపారు. తమ శక్తి, సామర్థ్యాలు, అనుకూల పరిస్థితుల మేరకు ఈ ఏడాది ప్రయోగాల సంఖ్య 14 వరకు ఉండవచ్చని అంచనా వేశారు. 2025లో చేపట్టనున్న గగన్యాన్కు 2024 సంసిద్ధత సంవత్సరంగా పేర్కొన్నారు. ఈ మిషన్కు సంబంధించిన పలు కీలక ప్రయోగాలను ఈ ఏడాదిలో పరీక్షిస్తామని వెల్లడించారు.
PSLV-C58 on board camera views. #XPoSat pic.twitter.com/vOtaLvGqAj
— ISRO (@isro) January 1, 2024